Friday, April 19, 2024

ప్రేమోన్మాదం.. ప్రేయసిని దారుణంగా చంపిన ప్రియుడు

ప్రియుడు ప్రేయ‌సిని చంపిన ఘ‌ట‌న వనపర్తి జిల్లాలో ఖిల్లా ఘనపూర్ మండలంలో చోటుచేసుకుంది. ప్రేయసి పెండ్లికి నిరాకరించిందనే అక్కసుతో ప్రియుడు ప్రేయసి మెడకు చున్నీతో ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు. మానాజీపేట గ్రామానికి చెందిన యువ‌కుడు.. హైదరాబాద్ మైలాదేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే యువ‌తి వీరిరువురు గత 5 సంవత్సరాల నుంచి ప్రేమించు కుంటున్నారు. గురువారం ఆ యువ‌తి ప్రియుడిని కలిసేందుకు హైదరాబాద్ నుంచి మనాజీపేట్‌కు చేరుకుంది. ఇద్దరు కలసి గ్రామ శివారులోని కెనాల్‌ సమీపంలో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో అమ్మాయి పెండ్లికి నిరాకరించడంతో ప్రియుడు కోపోద్రిక్తుడై ప్రియురాలి మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండాచేసి చంపాడు. దీంతో యువ‌తి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు అమ్మాయి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement