Monday, April 29, 2024

విప‌క్షాల సంఖ్య తక్కువ‌.. సభలో సమయం ఎక్కువ: కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు చర్చకు ఇచ్చే అంశాలను బట్టి అసెంబ్లీ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. కరోనా అదుపులో ఉండటంతో అసెంబ్లీ ఎక్కువ రోజులు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్లో సభ్యులకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వం తరపున ఐటీ, ఇండస్ట్రీ, హరితహారం అంశాలపై చర్చిస్తామని, బిల్లులపై సభ్యులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సీఎం సూచించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అసెంబ్లీ వేదికగా చేరవేయాలని చెప్పారు. ముఖ్యమైన అంశాలకు కావలసినంత సమయం కేటాయించాలన్నారు. అసెంబ్లీలో కొత్త నిబంధనలు రూపొందించుకొని దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నా విపక్షాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని తెలిపారు. ఇక ముందు కూడా ఇదే పద్ధతి కొనసాగుతుందని కేసీఆర్‌ ప్రకటించారు. కాగా, అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాల‌ను అక్టోబ‌ర్ 5వ తేదీ వ‌ర‌కు కొన‌సాగించాల‌ని బీఏసీలో నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే.

ఇది కూడా చదవండి: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అక్టోబర్‌ 5 వరకు..

Advertisement

తాజా వార్తలు

Advertisement