Thursday, May 2, 2024

బాలయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ రాత్రి ఫుల్ బాటిల్ కొడతారని, పగలు జనాలను కొడతారని మాధవ్ ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాక హిందూపురం ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని చెప్పారు. ఆయన పక్కన నిల్చోవడానికి కూడా వణికిపోతున్నారని అన్నారు. బాలకృష్ణ చేత దెబ్బలు తిన్నవాళ్లు, బూతులు తిట్టించుకున్నవాళ్లు ఎంతోమంది ఉన్నారని చెప్పారు. ఓటేసిన పాపానికి శిక్షను అనుభవించడానికి అభిమానులు సిద్ధంగా లేరని, అందుకే వారంతా వైసీపీ వైపు చూస్తున్నారన్నారు.

అటు రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని… చంద్రబాబు ముసలోడు అయిపోయారని, ఆయన కొడుకు లోకేష్‌కు నోట మాట రాదని విమర్శించారు. పంక్చరైన సైకిల్‌ను చంద్రబాబు వయోభారంతో తొక్కలేక తొక్కుతున్నారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement