Monday, April 29, 2024

తెల‌గాణ స‌ర్కార్ శుభ‌వార్త – గీత కార్మికుల‌కు ఎక్స్ గ్రేషియా

గీత కార్మికుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. ప్ర‌మాద‌వ‌శాత్తు గీత కార్మికులు మ‌ర‌ణిస్తే ప్ర‌భుత్వం అందించే ఎక్స్ గ్రేషియాను రైతు భీమా తరహాలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక ప్రకటన చేశారు.
హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు లో ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నీరా కేఫ్’ పనులను మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర గౌడ సంఘాల ప్రతినిధులు, ఆబ్కారీ, పర్యాటక శాఖల ఉన్నతాధికారుల తో కలసి పరిశీలించారు. మరుగున పడిపోతున్న కుల, చేతి వృత్తులకు పూర్వ వైభవాన్ని తేవాలనే లక్ష్యం తో హైదరాబాద్ లోని ఎంతో విలువైన నెక్లెస్ రోడ్డులో రూ.25 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొట్టమొదటి సారిగా నీరా కేఫ్ ను నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
ప్రజలకు ఆరోగ్యాన్ని , 15 రకాల వ్యాధుల నివారణకు ఔషధ గుణాలు కలిగిన నీరా, కల్లును హైదరాబాద్ నగరంలో నిషేధం విధించి అవమానించారన్నారు. గీత వృత్తిని, వృత్తిదారులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న కొంతమంది అహంకార పూరిత రాజకీయ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కుల సంఘాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement