Friday, April 26, 2024

శబరిమల భక్తులకు గుడ్ న్యూస్..

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. ఇకపై విమానంలో కూడా ఇరుముడి తీసుకెళ్లొచ్చు. దీనికి విమానయాన భద్రతా విభాగం (బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) అనుమతించింది. దీనికి సంబధించిన మార్గదర్శకాలు, ఆదేశాల్ని తాజాగా జారీ చేసింది. తాజా నిబంధనల ప్రకార కేరళలోని, శబరిమలకు వెళ్లే భక్తులు తమ వెంట కొబ్బరికాయ, పూజ సామగ్రి వంటి ఇరుముడిని విమానంలో తీసుకెళ్లొచ్చు. అయ్యప్ప మాల ధారణ చేసిన భక్తులు స్వామి వారికి నెయ్యి, కొబ్బరి కాయ, ఇతర ద్రవ్యాలతో కూడిన ఇరుముడిని శబరిమల వెళ్లి సమర్పిస్తారు. అయితే, ప్రయాణికుల భద్రత దృష్ట్యా వీటిని విమానంలో తీసుకెళ్లే విషయంలో ఆంక్షలు ఉండేవి. భక్తుల వినతి మేరకు వీటిని తీసుకెళ్లేందుకు తాజాగా అనుమతించింది. దీని కోసం ఇరుముడితోపాటు పూర్తి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement