Monday, May 6, 2024

TS | గుడ్​ న్యూస్​.. యాసంగి జొన్నలు కొనాలని మార్క్​ఫెడ్​కు సీఎం కేసీఆర్​ ఆదేశాలు

తెలంగాణలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని సీఎం కేసీఆర్​ ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్‌ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ 2022-23 యాసంగి సీజన్‌లో పండించిన జొన్న (హైబ్రిడ్) పంటకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఇవ్వాల (శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని మార్క్‌ఫెడ్‌ ఎండీకి సూచించింది.

అంతేకాకుండా యాసంగి సీజన్లో పండిన మొత్తం 65,494 మెట్రిక్ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేసేందుకు కావాల్సిన రూ.219.92కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామరెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల పరిధిలో జొన్న సాగు చేసిన లక్షల మంది రైతులకు కేసీఆర్​ సర్కారు తీసుకున్న నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement