Sunday, April 28, 2024

గోల్డెన్ వీసా అందుకున్న తొలి తమిళ నటిగా త్రిష రికార్డ్ ..

హీరోయిన్ త్రిష ఓ రికార్డ్ ని నెలకొల్పింది. ఆమెకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం గోల్డెన్ వీసా జారీ చేసింది. ఈ వీసా అందుకున్న తొలి తమిళనటిగా త్రిష రికార్డులకెక్కారు. ఈ విషయాన్ని త్రిష తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటిని తానే కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ విషయాన్ని వెల్లడించగానే త్రిషకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ఫర్హాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీకపూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, నేహా కక్కర్, అమాల్ మల్లిక్, మోహన్‌లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ప్రముఖ నేపథ్య గాయని కేఎస్ చిత్ర వంటివారు ఇప్పటి వరకు యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నారు.

తమిళ చిత్ర పరిశ్రమ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటి మాత్రం త్రిష కావడం విశేషం.  2019 నుంచి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు జారీ చేయడం మొదలుపెట్టింది. ఈ వీసా కలిగినవారు యూఏఈలో సుదీర్ఘకాలం నివాసం ఉండొచ్చు. ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు, సైన్స్, క్రీడలు, తెలివితేటలు వంటి ప్రత్యేక నైపుణ్యం కలిగినవారు, ప్రొఫెషనల్స్‌ ఈ గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని 5 లేదంటే 10 ఏళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు. కాలపరిమితి ముగిశాక వాటంతట అవే రెన్యువల్ అవుతాయి. అయితే త్రిషకి ఇకపై ఇండియాతో పాటు యూఏఈలో కూడా ఉండొచ్చన్న మాట.

Advertisement

తాజా వార్తలు

Advertisement