Friday, April 26, 2024

పోలెండ్ స‌రిహ‌ద్దులోని ఉక్రెయిన్ శ‌ర‌ణార్థి శిబిరాల‌ను సంద‌ర్శించిన – గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక‌చోప్రా

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక‌చోప్రా .. యునిసెఫ్ సౌహార్ద్ర రాయబారి హోదాలో పోలెండ్ సరిహద్దులోని ఉక్రెయిన్ శరణార్ధి శిబిరాలను సందర్శించారు. రష్యా దండయాత్రతో అయినవారిని వదిలి పోలెండ్ చేరుకున్న ఉక్రెయిన్ చిన్నారులను కలిసి వారిలో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు ప్రియాంక‌చోప్రా. వారితో ఆడిపాడారు. అక్కడి శరణార్థుల దయనీయ గాథలు విని ఓ దశలో ఆమె కంటతడిపెట్టుకున్నట్టు తెలుస్తోంది. తన పోలెండ్ పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రియాంకా చోప్రా సోషల్ మీడియాలో పంచుకున్నారు. చిన్నారుల‌తో క‌లిసి ఆమె సంతోషంగా గ‌డిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement