Saturday, May 18, 2024

స్కూటీని తాకినందుకు బైక‌ర్ ‘మొబైల్’ ప‌గుల‌కొట్టిన అమ్మాయి

త‌న స్కూటీని బైక్ తాక‌డం పెద్ద డ్రామాకి తెర‌లేపింది ఓ అమ్మాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఇటావాలో చోటు చేసుకుంది ఈ సంఘ‌ట‌న‌.
త‌న స్కూటీని బైక్ తాక‌డంతో ఆ బాలిక మోటార్‌సైకిల్‌పై వెళ్లే వ్యక్తి మొబైల్‌ను లాక్కొని పగలగొట్టింది. ఇప్పుడు ఈ సంఘ‌ట‌న‌కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తాను క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఆ అమ్మాయి నా ఫోన్ పగలగొట్టిందని ఆ వ్యక్తి చెప్పాడు. ఈ మేర‌కు ఇటావా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మేర‌కు కేసు న‌మోద‌యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు ఆ వ్యక్తి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఇంత డ్రామా చేసిన అమ్మాయి ఆచూకీ లభించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement