Monday, April 29, 2024

ప్ర‌జ‌ల చేతిలో అధికారం ఉంటే – అంతా స‌ర్దుకుంటుంది గులాంన‌బీ ఆజాద్

ప్ర‌జ‌ల చేతిలో అధికారం పెడితే అంతా స‌ర్దుకుంటుంద‌ని అన్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు గులాంన‌బీ ఆజాద్. జ‌మ్మూకాశ్మీర్ ఎన్నిక‌ల‌పై ప‌లు కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారాయ‌న‌. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ మసీదులో నమాజ్ చేసిన తరువాత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మీడియాతో మాట్లాడారు. కాశ్మీర్ లో ఎన్నిక‌లు .. జరిగి అధికారం ప్రజల చేతుల్లో ఉంటే అప్పుడు అంతా సవ్యంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. దేశం కోవిడ్-19 నుండి కొంత ఉపశమనం పొందడం ఆనందదాయకమైన విషయం. కరోనా వల్ల ఎంతో మంది ప్ర‌జ‌లు రోడ్డున ప‌డ్డారు. ఇప్పుడైన ప్రజల్లో విద్వేషాలు తొలగిపోవాల‌న్నారు. పీడీపీతో నాయకురాలు మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో బీజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే 2018 జూన్ లో ప్ర‌భుత్వం నుంచి బీజేపీ వైదొల‌గింది. అప్ప‌టి నుంచి అక్క‌డ రాష్ట్రప‌తి పాల‌న కొన‌సాగుతోంది. 2019 ఆగస్టులో రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కాగా ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. ఈ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉన్నప్ప‌టికీ శాసన సభను కలిగి ఉంది. చాలా కాలంగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని అధికారులు పదేపదే హామీ ఇచ్చారు. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ ఎన్నిక‌లు జ‌ర‌గలేదు. అయితే డీలిమిటేషన్ కమిషన్ తన తుది నివేదికను కొద్ది రోజుల్లో సమర్పించబోతోందని ఇటీవలి నివేదికలు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement