Sunday, April 28, 2024

వంట చేస్తోన్న సమయంలో పేలిన గ్యాస్ సిలిండర్లు..30మందికి పైగా గాయాలు..25మంది పరిస్థితి విషమం

వంట చేస్తోన్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్లు పేలి..భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 30మందికి పైగా గాయాలపాలయ్యారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన బీహార్ లోని ఔరంగాబాద్ లో ఛఠ్ పూజకు సిద్ధమవుతోన్న వేళ ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని శాహ్ గంజ్ ప్రాంతంలో ఛఠ్ పూజ నిమిత్తం ఓ కుటుంబం శనివారం రెండు గంటల సమయంలో వంటలని సిద్ధం చేస్తోంది. సూర్యోదయం లోపులో ప్రసాదం తయారుచేసే పనిలో నిమగ్నమయ్యింది. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగా సిలిండర్లకు మంటలు అంటుకుని.. భారీగా వ్యాపించాయి. వాటిని ఆర్పేందుకు చేసే ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. దాంతో ఈ ఘటనలో 30 మంది గాయాలపాలయ్యారు. 25మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కొంతమంది సిబ్బంది కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే ఔరంగాబాద్ లోని సదర్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement