Friday, March 29, 2024

Breaking : వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు..బిజెపిపై ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్నాం..మంత్రి కేటీఆర్

చేనేతపై పన్ను వేసిన తొలి ప్రధాని నరేంద్ర మోడీ అని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. హ్యాండ్ లూమ్ పార్క్ ని కడతామని కట్టలేదన్నారు. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ కు రుణాలు ఆపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో అసాధారణమైన పరిస్థితి కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయన్నారు. ఏం చేశామో..ఏంచేస్తామో మేం స్పష్టంగా చెబుతున్నామన్నారు. కానీ వాళ్లు వ్యక్తిగత దూషణలు..విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బిజెపిపై ఛార్జ్ షీట్ ని విడుదల చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.మిషన్ భగీరథకి రూ.19వేల కోట్లు ఇవ్వాలని తెలిపారు. నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా పట్టించుకోలేదన్నారు. నల్గొండ జిల్లాపై బిజెపి కాంఠిన్యం చూపించిందన్నారు. ఫ్లోరోసిస్ బాధితులను బిజెపి పట్టించుకోలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement