Monday, April 29, 2024

త్వరలో విశాఖకు వస్తాం: కేటీఆర్

విశాఖ ఉక్కు ఉద్యమానికి.. బహిరంగంగా మద్దతు ప్రకటించడమే కాకుండా అవసరమైతే విశాఖ వచ్చి ఉద్యమానికి సంఘీభావం తెలుపుతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ సీనియర్  నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఐటీశాఖ మంత్రి కేటీ రామారావును శనివారం కలిశారు. శాసనసభ సమావేశాల సందర్భంగా బిజీగా ఉన్న కేటీఆర్ తో అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో గంటా శ్రీనివాస్ భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపేందకు ఆయనను కలిసినట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రులతో కలిసి ఓ బృందంగా విశాఖకు వస్తామని కేటీఆర్ చెప్పినట్లు గంటా పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement