Monday, April 29, 2024

తీన్మార్ మల్లన్న ఓటమి తట్టుకోలేక యువ‌కుడి ఆత్మ‌హ‌త్య..

నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ స్థానం లో గెలిచిన టిఆర్ఎస్ అభ్యర్థి ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డికి గ‌ట్టిపోటీనిచ్చిన స్వ‌తంత్ర అభ్య‌ర్థి తీన్మార్ మ‌ల్ల‌న్న రెండో స్థానానికే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే మల్లన్న ఓటమిని తట్టుకోలేక శ్రీ‌శైలం అనే‌ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. న‌ల్ల‌గొండ జిల్లా మర్రిగూడ మండలం, లంకలపల్లికి చెందిన శ్రీ‌శైలం తీన్మార్ మ‌ల్ల‌న్న ఓటమిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీశైలం తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు మ‌ద్ద‌తుగా ఇటీవ‌ల ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నాడు. తీన్మార్ మల్లన్న ఓడిపోయార‌ని తెలుసుకుని మ‌న‌స్తాపం చెందాడు. ఈ రోజు ఉద‌యం శ్రీ‌శైలలం పురుగులమందు తాగాడు. శ్రీ‌శైలం కుటుంబ సభ్యులు ఈ విష‌యాన్ని గుర్తించి ఆయ‌న‌ను నల్ల‌గొండ ఆసుప‌త్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement