Thursday, May 16, 2024

Breaking | గంగులకు వెన్నంటి ఉండాలి.. కరీంనగర్ రూపురేఖలు మార్చాడు: మంత్రి కేటీఆర్

కరీంనగర్ (ప్రభ న్యూస్) : అభివృద్ధిలో కరీంనగర్ ను అగ్రగామిగా మార్చిన గంగుల కమలాకర్ కు ప్రజలు వెన్నంటి ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం రాత్రి కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ కరీంనగర్ రూపురేఖలు మార్చిన ఘనత గంగుల కమలాకర్ కే దక్కుతుందన్నారు. కార్పొరేటర్ స్థాయి నుండి మంత్రి వరకు ఎదిగిన కమలాకర్ కు ప్రజలు వెన్నంటి అండగా ఉండాలని చెప్పి, ఇన్ డైరెక్ట్ గా రాబోయే ఎన్నికల్లో కమలాకర్ కు మద్దతు ఇవ్వాలని తెలిపారు.

నగర ప్రజలకు 24 గంటల పాటు మంచినీళ్లు ఇవ్వాలని లక్ష్యంతో కమలాకర్ ముందుకు వెళ్తున్నారన్నారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో కమలాకర్ టికెట్ కన్ఫామ్ అయిపోయింది. కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగడంతో పాటు మంత్రి కేటీఆర్ ఉపన్యాసంతో గంగుల అభిమానుల్లో నూతన ఉత్సాహం వెలివేరిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement