Thursday, May 2, 2024

Breaking: ముద్రా బ్యాంక్​ పేరిట మోసం.. మేనేజర్​తో సహా సిబ్బందిని బంధించిన సభ్యులు

నల్లబెల్లి, (ప్రభ న్యూస్): వరంగల్​ జిల్లాలో ముద్రా బ్యాంక్​ మేనేజర్​, సిబ్బందిని గదిలో వేసి నిర్బంధించిన ఘటన ఇవ్వాల (ఆదివారం) జరిగింది. నల్లబెల్లి మండలంలో దాదాపు 150 మంది సభ్యులను చేర్చుకుని రోజువారీ, నెలవారీ పద్ధతిలో వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించుకున్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా వ్యాపారం చేస్తూ 45 లక్షల దాకా వసూలు చేశారు. ఈ మొత్తాన్ని సభ్యులకు ఎవరికీ ఇవ్వకుండానే బోర్డు తిప్పేసిన ముద్రా బ్యాంకుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా 235 బ్రాంచీలను ఓపెన్​ చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు ప్లాన్​ చేసిన బ్యాంకు సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఆదివారం నల్లబెల్లికి వచ్చిన వారిని ఓ గదిలో బంధించారు. దీంతో జోక్యం చేసుకున్న పోలీసులు మంగళవారం ఈ విషయమై చర్చించి సభ్యులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని సభ్యులకు నచ్చజెప్పి బందీలుగా ఉన్న వారిని విడిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement