Friday, April 26, 2024

తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు పోటెత్తిన వరద!

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద క్రమంగా పెరుగుతోంది. ఇరు రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులు జల కళ సంతరించుకుంటుంది. ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల నుంచి జూరాలకు వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల జలాశయంలో వరద పెరగడంతో శ్రీశైలానికి 35వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద ప్రవాహంలో 8,238 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరిలో శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు నిన్న ఉదయం వరకు 1.17 లక్షల క్యూసెక్కులు రాగా, సాయంత్రానికి అది 9,876 క్యూసెక్కులకు తగ్గింది. కడెం ప్రాజెక్టు నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి 32 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. కాళేశ్వరంలోని లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజీ నుంచి 41 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం నుంచి 1.12 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement