దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా గడిచిన 24గంటల్లో మొత్తం 20లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా… 38,079మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా తో 560 మంది మృతి చెందారు.
తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 3,10,64,908కి చేరింది.అలాగే యాక్టివ్ కేసుల సంఖ్య 4,24,026కి చేరింది. డిశ్చార్జ్ అయిన వారి 3,02,27,792కి పెరిగింది. అలాగే మొత్తం మరణాల సంఖ్య 4,13,091కి చేరింది.