Friday, April 26, 2024

Breaking: 50 ఏళ్ల అమర జవాన్ జ్యోతి.. వార్ మెమోరియల్ టార్చ్ లో విలీనం..

50 ఏళ్ల నుంచి నాన్ స్టాప్ గా వెలుగుతున్న అమరజవాన్ జ్యోతి ఆరిపోయింది. ఇప్పుడా జ్యోతిని వార్ మెమోరియల్ దగ్గర వెలిగించే టార్చ్ లోకి షిఫ్ట్ చేశారు. కాగా, ఎన్నో వివాదాలు, రాజకీయ వ్యాఖ్యానాల మధ్య కేంద్ర ప్రభుత్వం ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతిని వార్ మెమోరియల్ కు తరలించేసింది. సైనిక కవాతు నడుమ ఆ జ్యోతిని తరలించారు.

అక్కడ దాన్ని ఒక టార్చ్ లో విలీనం చేయనున్నారు. ఇండియా గేట్ నుండి 400 మీటర్ల దూరంలో ఉన్న కొత్త వార్ మెమోరియల్ వరకు శాశ్వత జ్వాలతో సైనికులు కవాతు చేశారు. 1947 నుండి అమరులైన సైనికులకు నివాళులర్పించే ఏకైక ప్లేస్ గా వార్ మోమోరియల్ మారనుంది. దీన్ని 2019లో నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement