Friday, May 3, 2024

Big Breaking: ఫాంహౌస్ ట్రాప్ కేసు.. రేప‌టికి వాయిదా వేసిన హైకోర్టు

టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభ పెడుతూ.. కొనుగోళ్ల‌కు దారితీసిన వ్య‌వ‌హారం ఇవ్వాల (శుక్ర‌వారం) హైకోర్టుకు వెళ్లింది. నిన్న రాత్రి ఏసీబీ కోర్టులో నిందితుల‌ను ప్రొడ్యూస్ చేయ‌గా జ‌డ్జి ఈ కేసును తిరస్కరించారు. ఈ వ్య‌వ‌హారంలో ఎట్లాంటి న‌గ‌దు వ్య‌వ‌హారం లేనప్పుడు అది ఏసీబీ కింద‌కు రాద‌ని, పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌రిపిన త‌ర్వాత కేసు న‌మోదు చేయాల‌ని జ‌డ్జి సూచించారు. కాగా దీనిపై అప్పీల్ చేస్తూ పోలీసులు ఇవ్వాల హైకోర్టును ఆశ్ర‌యించారు.

కాగా, ఈ కేసు గురించి వాక‌బు చేసిన హైకోర్టు ధ‌ర్మాస‌నం ప‌లు ప్ర‌శ్న‌లు అడిగిన‌ట్టు తెలుస్తోంది. ప‌క్కాగా ట్రాప్ చేశారా? ఫామ్ హౌస్‌లో అన్ని అమ‌ర్చే వారిని ర‌ప్పించారా? అని ప్ర‌శ్శించ‌గా.. ఏజీ దీనికి అన్ని ఆధారాలు ప‌క్కాగా ఉన్నాయ‌ని స‌మాధానం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement