Sunday, April 28, 2024

పంటచేనులోనే రైతు సజీవదహనం.. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో..

పంట వ్యర్థాలను కాల్చేందుకు ఓ రైతు చేసిన ప్రయత్నం.. చివరికి అతన్నే బలి తీసుకుంది. పొగ వ్యాపించడంతో అస్వస్థతకు గురయ్యాడు.. ఏం చేయాలో దిక్కు తోచక అతడు అంటించిన మంటల్లోనే పడి సజీవదహనమైన ఘటన జరిగింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం జంగవానిగూడెంకు చెందిన భూర్క సారయ్య(80) తన పొలంలో మొక్కజొన్న కోసిన తర్వాత ఉండే కొయ్యకాళ్లను కాల్చే క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. గాలి తనవైపు రావడంతో మంటలు ఒకే సారి చెలరేగాయి. దాంతో ఆయన కళ్లు కనపడక పొగ వల్ల వచ్చిన మత్తుతో ప్రమాదవశాత్తు అందులో పడిపోయి సజీవదహనం అయినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement