Friday, April 26, 2024

Big Breaking: ఫామ్​ హౌస్​ డీల్​ కేసు.. సీవీ ఆనంద్​ ఆధ్వర్యంలో సిట్​ ఏర్పాటు!

తెలంగాణ ప్రభుత్వాన్ని డిస్టర్బ్​ చేయడానికి ఢిల్లీ నుంచి డీల్స్​ చేసిన మొయినాబాద్​ ఫామ్​ హౌస్​ కేసులో దర్యాప్తు స్పీడప్​ అవుతోంది. నిన్న హైకోర్టు విచారణకు ఆదేశించడంతో ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు కోసం హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ సీవీ ఆనంద్​ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్​)ని ఏర్పాటు చేసింది.

ఈ స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీమ్​ (SIT)లో ​ సభ్యులుగా నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్​ క్రైమ్స్​ డీసీపీ కమలేశ్వర్​ , నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్​ ఏసీపీ గంగాధర్​, శంషాబాద్​ డీసీపీ జగదీశ్​రెడ్డి, మొయినాబాద్​సీఐ లక్ష్మిరెడ్డి ఉన్నారు. ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఎందుకంటే ఈ కేసులో ఢిల్లీ నుంచి ఆపరేట్​ చేసినట్టు పలు ఆరోపణలు వస్తున్నాయి. కేంద్రంలోని పెద్దలు, బీజేపీ బడా లీడర్ల పేర్ల ప్రస్తావన ఉండడంతో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పారదర్శకంగా కేసు విచారణ ఉండేలా చర్యలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement