Thursday, May 2, 2024

ప‌వ‌న్ క‌ల్యాన్ పై ప‌డిన అభిమాని – కాన్వాయ్ పై ప‌డ్డ జ‌న‌సేనాని

ఏపీలో జ‌న‌సేన అధినేత‌, న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. మత్స్య కార్మికుల హక్కుల కోసం నరసాపురం లో పవన్‌ కళ్యాణ్‌.. బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇందులో భాగంగానే.. నరసాపురం చేరుకున్న పవన్‌ కళ్యాణ్‌ కు ఊహించని పరిణామం ఎదురైంది. నరసాపురం చేరుకున్న పవన్‌ కళ్యాణ్‌.. తన కాన్వాయ్‌ పైకి నిల్చుని.. ప్రజలకు, తన అభిమానులకు అభివాదం చేసారు. ఈ నేపథ్యంలోనే… పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌.. ఒక్కసారిగా కాన్వాయ్‌ పైకి ఎక్కి..పవన్‌ పై పడిపోయాడు. దీంతో బొక్కా బోర్లా పడిపోయాడు పవన్‌ కళ్యాణ్‌. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement