Thursday, April 25, 2024

Fake Notes: ఏపీలో భారీగా బయటపడిన నకిలీ నోట్లు

ఏపీలో నకిలీ నోట్ల దందా జోరుగా సాగుతున్నది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం పుట్రేల వద్ద నకిలీ నోట్ల ముఠా పట్టుబట్టింది. వారి వాహనాలను తనిఖీ చేయగా 47 లక్షలకు పైగా విలువచేసే నకిలీ నోట్లు బయటపడ్డాయి. పుట్రేల వైపునకు వెళ్తున్న ఓ కారును పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఈ క్రమంలో రెండు బ్యాగులు ఓపెన్‌ చేయగా భారీగా డబ్బు కట్టలు బయటపడ్డాయి. అయితే, వాటిని పరిశీలించగా.. అవి నకిలీవని తేలాయి. మొత్తం 47.50 లక్షల విలువ చేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుల రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.  నిందితుల నుంచి రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ ప్రసాద్ వెల్లడించారు. ఈ కేసులో మేకతోటి శశికిరణ్, గాలి రత్నం బాబు, పగిడిపల్లి గణేశ్ష్, తోట నరసింహారావులపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. అలాగే, ఈ కేసుపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement