Friday, April 19, 2024

రేపల్లే రైల్వే స్టేషన్ గ్యాంగ్ రేప్ పై స్పందించిన సీఎం జగన్

ఏపీలో సంచలన రేపుతన్న బాపట్ల జిల్లాలోని రేపల్లే రైల్వే స్టేషన్ గ్యాంగ్ రేప్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఈ కేసులో ద‌ర్యాప్తు జ‌రుపుతోన్న‌ బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ తో ఫోన్లో మాట్లాడి, వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం ప‌లు సూచ‌న‌లు చేశారు. కాగా, నిన్న అర్ధరాత్రి ముగ్గురు దుండ‌గులు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన ఓ మ‌హిళ‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డ విష‌యం తెలిసిందే. పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ ముగ్గురు అనుమానిత యువ‌కులు రేపల్లె నేతాజీ నగర్ కు చెందినవారని గుర్తించారు. మద్యం మత్తులో వారు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement