Friday, April 26, 2024

KTR: మూసీ నదిపైన ఎక్స్‌ప్రెస్‌వే.. మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేలా ప్రయత్నిస్తున్నామని, మూసీ నదిపైన ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని చేపడతామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డుపై నార్సింగి వద్ద రూ.29.50కోట్లతో నిర్మించిన ఇంటర్‌ఛేంజ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. మురుగు నీటిని పునర్వినియోగించేలా పాలసీని తీసుకొస్తామన్నారు. సెప్టెంబర్‌ నాటికి హైదరాబాద్‌లో మురుగునీరు శుద్ధీకరణ పూర్తవుతుందని, రద్దీ మేరకు సర్వీస్‌ రోడ్లను విస్తరించాలని సీఎం కేసీఆర్‌ చెప్పారన్నారు.

ప్రజల విజ్ఞప్తి మేరకు ఓఆర్‌ఆర్‌పై 120కి.మీ. వరకు వాహనాల స్పీడు పెంచామన్నారు. మూసీ నదిపై 14 బ్రిడ్జ్‌ల నిర్మాణానికి అనుమతులిచ్చామన్నారు. శంషాబాద్‌ నుంచి మూసీ వరకు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తామన్నారు. త్వరలో కోకాపేట్‌, మల్లంపేట్‌లో ఇంటర్‌ఛేంజ్‌లు వస్తాయన్నారు. మూసీపై స్కైవే కూడా నిర్మిస్తామన్నారు. శంషాబాద్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50కోట్లు కేటాయించామన్నారు. బీహెచ్ఈఎల్‌ నుంచి కందుకూరు వరకు మెట్రో విస్తరిస్తామన్నారు. హైదరాబాద్‌లో 100శాతం సీవరేజ్‌ ట్రీట్మెంట్ చేస్తున్నామని కేటీఆర్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement