Friday, May 17, 2024

హైదరాబాద్‌లో కన్‌ఫ్లూయెంట్‌, వైద్య పరికరాల తయారీ యూనిట్‌ ఏర్పాటు: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రపంచ ప్రఖ్యాత వైద్య పరికరాల తయారీ కంపెనీ కన్‌ఫ్లూయెంట్‌ మెడికల్‌ సంస్థ #హదరాబాద్‌లో తన తయారీ యూనిట్‌ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. త్వరలో పైలట్‌ ప్రాతిపదికన ఒక తయారీ యూనిట్‌ని మొదలు పెట్టి 12 నెలల్లో దాని భారీగా విస్తరించేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తుల తయారీ కోసం నిటినోల్‌ వంటి అగ్రశ్రేణి సాంకేతిక పరిజ్ఞానాన్ని #హదరాబాద్‌ నగరానికి తీసుకురానుంది. దేశంలో ఈ స్థాయి టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసే మొదటి కంపెనీగా కన్‌ఫ్లూయెంట్‌ మెడికల్‌ నిలవనున్నది. దేశంలోని మెడికల్‌ డివైసెస్‌ తయారీ కంపెనీలకు తన ఉత్పత్తుల ఆధారంగా సేవలు అందించనుంది. హైదరాబాదులో స్థాపించబోయే తన తయారీ యూనిట్‌ ద్వారా భారతదేశంతో పాటు ఆసియా ఖండంలోని ఖాతాదారులకు తన ఉత్పత్తులను హైదరాబాద్‌ యూనిట్‌ ద్వారా సరఫరా చేయనున్నది. కన్‌ఫ్లూయెంట్‌ మెడికల్‌ సంస్థ అధ్యక్షులు, సీఈవో అయిన డీన్‌ షావర్‌ అమెరికాలోని శాన్‌ హూ నగరంలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన సందర్భంగా తమ సంస్థకు సంబంధించిన యూనిట్‌ ఏర్పాటు ప్రకటన చేశారు.

భారతదేశానికి తొలిసారిగా అత్యంత అధునాతన టెక్నాలజీని తీసుకురావాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌ నగరాన్ని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నామని, భవిష్యత్తులో తమ కంపెనీని భారీగా విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు కేటీఆర్‌కు తెలిపారు. త్వరలోనే తమ కంపెనీ బయోమెడికల్‌ టె్టక్సల్‌ సేవలకు సంబంధించి ప్రణాళికలను ప్రకటిస్తామని తెలిపారు. తమ తయారీ యూనిట్‌ ఏర్పాటు కోసం #హదరాబాద్‌ నగరాన్ని ఎంచుకున్న కన్‌ఫ్లూయెంట్‌ మెడికల్‌ టెక్నాలజీ సంస్థకు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్య రంగాల్లో మెడ్‌ టెక్‌ రంగం ఒకటని ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలిపారు. ఈ సంస్థ తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి అన్ని రకాల సహాయ స#హకారాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తామని, భవిష్యత్తులో సంస్థతో తెలంగాణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పని చేద్దామని కేటీఆర్‌ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి కె.తారకరామారావుతో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, డైరెక్టర్‌ లైఫ్‌ సైన్సెస్‌ శక్తి నాగప్పన్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement