Friday, May 3, 2024

BJP VS TRS: బండి సంజయ్ కి మంత్రి ఎర్రబెల్లి సవాల్

బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అబ‌ద్ధాలు చెప్ప‌డం మానుకోవాల‌ని, వాస్త‌వాలు మాట్లాడ‌డం నేర్చుకోవాల‌ని హితవు పలికారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ప్ర‌జ‌లు ప్రశాంతంగా ఉన్నార‌ని, పాద‌యాత్ర చేస్తూ ప్ర‌జ‌ల‌కు బండి సంజ‌య్ ఎందుకు అబ‌ద్ధాలు చెబుతున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలంగాణలో సంక్షేమ ప‌థ‌కాలు అద్భుతంగా ఉన్నాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వ‌మే చెబుతోంద‌ని గుర్తు చేశారు. ఉపాధి హామీ నిధులు మూడు నెల‌ల నుంచి ఇవ్వ‌ట్లేద‌ని అంటున్నార‌ని, ల‌బ్ధిదారుల‌కు కేంద్ర ప్ర‌భుత్వ‌మే నేరుగా బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బులు వేస్తుంద‌ని తెలిపారు. దీనిపై తెలంగాణ ప్ర‌భుత్వంపై అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్న బండి సంజ‌య్‌ను ఏమ‌నాల‌ని ఆయ‌న నిల‌దీశారు. బండి సంజయ్ జూటా మనిషి అని విరుచుకుపడ్డారు. ఉపాధి హామీ పథకంపై బండి సంజయ్‌కు అవగాహన లేదని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో ఉపాధి హామీ ప‌థ‌కం ఎలా కొన‌సాగుతుందో, తెలంగాణ‌లో ఎలా కొన‌సాగుతుందో చ‌ర్చించేందుకు త‌మ వ‌ద్ద‌కు రావాల‌ని బండి సంజ‌య్‌కు స‌వాలు విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement