Thursday, May 2, 2024

విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్‌ రెడీ.. జ‌న‌వ‌రి 22 నుంచి మ్యాచ్‌లు..

వెస్టిండీస్‌తో జనవరిలో జరగనున్న టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఇంగ్లండ్‌ జట్టును ప్రకటించింది. 16మంది సభ్యుల జట్టులో ఇద్దరు కొత్తవారికి అవకాశం లభించింది. పేసర్‌ డేవిడ్‌ పైన్‌, జార్జ్‌ గార్టన్‌లకు చోటు దక్కింది. విండీస్‌ పర్యటనలో వీరు ఇంగ్లండ్‌ తరఫున అరంగేట్రం చేయనున్నారు. ఈ సిరీస్‌కు తాత్కాలికి హెడ్‌కోచ్‌గా కోలింగ్‌వుడ్‌ వ్యవహరించనున్నాడు. ఈ సందర్భంగా కోలింగ్‌వుడ్‌ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్ని సమతుల్యం చేస్తూ ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు తెలిపాడు.

ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ మధ్య జరిగే 5మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ జనవరి 22, రెండోమ్యాచ్‌ జనవరి 23, మూడో మ్యాచ్‌ జనవరి 26, నాలుగో మ్యాచ్‌ జనవరి 26, ఐదో మ్యాచ్‌ జనవరి 30న జరగనుంది. ఇంగ్లండ్‌ టీ20జట్టు: ఇయాన్‌ మోర్గాన్‌ (కెప్టెన్‌), మొయిన్‌అలీ, టామ్‌బాంటన్‌, సామ్‌బిల్లింగ్స్‌, లియామ్‌ డాసన్‌, జార్జ్‌ గార్డన్‌, క్రిస్‌జోర్డాన్‌, లివింగ్‌స్టోన్‌, సకీబ్‌, మిల్స్‌, డేవిడ్‌ పైన్‌, అదిల్‌ రషీద్‌, జేసన్‌రాయ్‌, ఫిల్‌సాల్ట్‌, రీస్‌ టోప్లే, జేమ్స్‌విన్సే.

Advertisement

తాజా వార్తలు

Advertisement