Wednesday, May 1, 2024

క‌శ్మీర్ లో ఎన్ కౌంట‌ర్ – ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు మృతి

క‌శ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో భీక‌ర ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఎన్ కౌంట‌ర్ లో ఇద్ద‌రు గుర్తు తెలియ‌ని ఉగ్ర‌వాదులు మ‌ర‌ణించార‌ని జ‌మ్మూ క‌శ్మీర్ పోలీసులు తెలిపారు. షోపియాన్ జిల్లా చౌగామ్ ప్రాంతంలో భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌కు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు, పోలీసులు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. అలెర్ట్ అయిన బలగాలు.. ఎదురు కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. కాగా, నిన్న జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది హతమయిన సంగ‌తి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement