Thursday, May 2, 2024

ఢిల్లీలో దారుణం.. ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న జంట‌.. ఉప్పెన సీన్ రిపీట్‌..

ఉప్పెన సినిమాలో మాదిరిగానే ఇక్క‌డ కూడా సీన్ రిపీట్ అయ్యింది. ప్రేమించాడన్న‌ కారణంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఆ కుర్రాడి మర్మాంగాన్ని కోసేశారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో జ‌రిగింది. ఢిల్లీకి చెందిన ఓ యువతి, యువకుడు ల‌వ్ చేసుకున్నారు. వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాత డిసెంబర్ 22న ఢిల్లీకి చేరుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని ఢిల్లీలోని రాజౌరీ పోలీసులను ఆశ్రయించారు. స్టేషన్ నుండి బయటకు వస్తున్న సమయంలో ఆ యువకుడిని కిడ్నాప్ చేసిన యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. ఆ తర్వాత అతడి మర్మాంగాన్ని కోసేశారు. ప్రస్తుతం ఆ యువకుడికి సఫ్దర్ జంగ్ హాస్పిట‌ల్‌లో ట్రీట్‌మెంట్ జ‌రుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement