Sunday, May 19, 2024

Anantapur: కియా పరిశ్రమలో గ్యాస్ లీక్.. ఇంజినీర్ మృతి

అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఉన్న కియా పరిశ్రమకు అనుబంధంగా ఉన్న  హుండాయ్ పరిశ్రమలో గ్యాస్ లీకై ఒక వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. నిన్న రాత్రి కియా ప్రధాన ప్లాంట్‌లో ఉన్న హుందాయ్‌లో మెకానికల్ ఇంజనీర్లు అయ్యప్పన్, పాషా విధులకు హాజరయ్యారు. శుక్రవారం తోటి ఉద్యోగులు వెళ్లి చూసే వరకే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో అయ్యప్పన్ మృతి చెందినట్టు గుర్తించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న పాషాను మెరుగైన చికిత్స నిమిత్తం పాషాను అనంతపురం తరలించారు. ఘటనపై విచారణ పెనుకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై యాజమాన్యం ప్రకటన చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement