Monday, April 29, 2024

Encounter : ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దు ప్రాంతం దంతెవాడ జిల్లా మరోసారి కాల్పులతో ప్రతిధ్వనించింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకోగా.. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. గొండెరాస్ అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లుగా అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దులోని గొండెరాస్ అటవీ ప్రాంతంలో మావోలు, డీఆర్‌జీ జవాన్లు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. సెర్చ్ ఆపరేషన్‌లో ఘటనా స్థలం నుంచి ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మృతులు:
హిద్మే కొహ్రామే, ఏరియా కమిటీ సభ్యురాలు మల్లంజర్ ఏరియా కమిటీ, దర్భా డివిజన్. రూ. 5లక్షల రివార్డు ఉంది.
పొజ్జె, సీఎన్‌ఎం ఇన్‌ఛార్జ్ మల్లెంజర్ ఏరియా కమిటీకి చెందిన నీల్లవాయ ఏరియా, దర్భ డివిజన్ ఆమెపై లక్ష రూపాయల రివార్డు ఉంది. సంఘటనా స్థలం నుండి రైఫిళ్లు, మందుగుండు సామాగ్రి, కమ్యూనికేషన్ పరికరాలు, పేలుడు పదార్థాలు, క్యాంపింగ్ మెటీరియల్స్ మొదలైనవి స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన మావోయిస్టుల కోసం కూంబింగ్ సాగుతోంది. తప్పించుకున్నవారిలో మావోయిస్టు అగ్రనేతలున్నారని సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement