Sunday, April 28, 2024

Srinagar: షోపియాన్లో ఎన్కౌంటర్ : ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్మూ కశ్మీర్ లోని షోపియాన్ అంశీపొరా ఏరియాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అక్క‌డ‌ ఇద్ద‌రు టెర్రరిస్టులు దాక్కొని ఉన్నారనే సమాచారం అందడంతో పోలీసులతో కలసి సెక్యూరిటీ ఫోర్సెస్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఇద్దరు టెర్రరిస్టులు మృతి చెందారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారి దగ్గర నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement