Thursday, March 28, 2024

స‌ర్కార్ వారి పాట నుండి ‘సెకండ్ సాంగ్’ రానుంది – త‌మ‌న్

ప‌ర‌శురామ్ తెర‌కెక్కిస్తోన్న చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఈ చిత్రంలో మ‌హూశ్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్నారు. కాగా ఈ చిత్రం నుండి క‌ళావ‌తి సాంగ్ టెండ్ర్ గా మారిన సంగ‌తి తెలిసిందే. చాలా తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ ను రాబట్టిన పాటల్లో ‘సర్కారువారి పాట’ సినిమాలోని ‘కళావతి’ ఒకటిగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశలో ఉంది.
మైత్రీ .. 14 రీల్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. తమన్ ఈ సినిమాకి బాణీలను సమకూర్చాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన ‘కళావతి’ పాట ఒక రేంజ్ లో జనంలోకి దూసుకుపోయింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ ను .. లైక్స్ ను రాబట్టుకుంది.అనంత్ శ్రీరామ్ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ ఆలాపన .. కొరియోగ్రఫీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ పాట సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నామనీ. మరో సాంగ్ ను ప్రిపేర్ చేస్తున్నామని తమన్ చెప్పాడు. త్వరలోనే ఈ సినిమా నుంచి మరో సాంగ్ రానుందన్న మాట. మే 12వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement