Friday, April 26, 2024

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌పై ఎలాన్ మ‌స్క్ వేటు.. ట్విట్ట‌ర్ లో 5వేల మంది తొల‌గింపు..

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసిన నాటి నుంచి ఆ సంస్థలో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారు. సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న వారానికే 50శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన మస్క్‌.. మరో షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆయ‌న‌ తీసుకున్న తాజా నిర్ణయంతో సుమారు 4,400 నుంచి 5,500 మంది ఔట్‌సోర్సింగ్‌ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్టు తెలుస్తోంది. అయితే వారికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తొలగించినట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ-మెయిల్‌, ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌తో ఉద్యోగులు యాక్సెస్‌ కోల్పోయిన తర్వాతే తాము లేఆఫ్‌లకు గురైనట్లు వారికి తెలిసిందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement