Thursday, May 2, 2024

క్యాసినో కేసులో.. మరో ముగ్గురికి ఈడీ నోటీసులు

క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో మరో ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. సంపత్ తో పాటు హవాలా ఆపరేటర్లు వెంకటేష్, రాకేష్ కు ఈడీ నోటీసులు పంపింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలు సోమవారం విచారణకు హాజరు కానున్నారు. అలాగే ఈ కేసులో ఈడీ నోటీసులు జారీ చేయడంతో సంపత్, వెంకటేష్, రాకేష్ లు కూడా ఈడీ విచారణకు హాజరు కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement