Saturday, May 4, 2024

Earthquake: అయోధ్య సమీపంలో భూకంపం

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య సమీపంలో భూకంపం సంభవించింది. గురువారం అర్దరాత్రి అయోధ్యలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అయోధ్య నగరానికి 176 కిలోమీటర్ల దూరంలో సంభవించినట్లు తెలిపింది. భూకంపం 15 కిలోమీటర్ల లోతులో వచ్చిందని అధికారులు చెప్పారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. భూ ప్రకంపనలతో భయపడిన జనం ఇళ్లలోంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. అయితే ఈ భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement