Saturday, May 4, 2024

రాజస్థాన్‌లో 3.8 తీవ్రతతో భూకంపం

రాజస్థాన్‌లోని జైపూర్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ రోజు ఉదయం 8.01 గంటలకు జైపూర్‌కు వాయువ్యంగా 92 కి.మీ దూరంలో ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement