Friday, April 26, 2024

రాజస్థాన్ లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.1 గా నమోదు

రాజస్థాన్‌లోని బికనేర్‌లో ఈరోజు తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున 2.01 గంటల సమయంలో బికనీర్‌లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు సంభవించాయని వెల్లడించింది. భూకంప కేంద్రం బికనేర్‌కు 236 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని పేర్కొన్నది. తెల్లవారుజామున భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement