Monday, May 6, 2024

ల‌ఢ‌క్ లో భూకంపం… రిక్ట‌ర్ స్కేలుపై 4.8 తీవ్ర‌త

లఢక్‌లో ఈరోజు ఉద‌యం స్వల్ప భూకంపం వచ్చింది. ఉదయం 4.19 గంటలకు లేహ్‌లో భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.8గా నమోదైంద‌ని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. లేహ్‌ సమీపంలోని ఆల్చీకి 189 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రముంద‌ని వెల్లడించింది. భూమి అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని పేర్కొన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement