Sunday, May 5, 2024

సెప్టెంబ‌ర్ 17ని టార్గెట్ చేస్తోన్న రాజ‌కీయ పార్టీలు-హైద‌రాబాద్ కి రానున్న అమిత్ షా

సెప్టెంబ‌ర్ 17అంటే తెలంగాణ‌కి ఎంతో ప్ర‌త్యేక‌త ఉన్న రోజు. ఈ రోజుని ప‌లు రాజ‌కీయ పార్టీలు టార్గెట్ చేశాయి. కేంద్రంలోని బీజేపీ సెప్టెంబ‌ర్ 17న తెలంగాణ విమోచ‌న దినంగా జ‌ర‌ప‌డానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్య‌క్ర‌మాల్లో బీజేపీ అగ్ర‌నేత‌లు పాలుపంచుకోనున్నార‌ని స‌మాచారం. కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు. తాజాగా రాష్ట్రంలో ఆయ‌న పర్యటన షెడ్యూల్ ఖరారైంది. శుక్ర‌వారం సాయంత్రం షా హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 9.50 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని శుక్రవారం రాత్రి నేషనల్ పోలీస్ అకాడమీలో బస చేస్తారు. శనివారం ఉదయం 8.45 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకోనున్నారు..

కాగా అమిత్ షా 11.45 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్‌లో ఉంటారు. కేంద్ర ప్రభుత్వ ‘విమోచన దినోత్సవం’ వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం నగరంలోని టూరిజం ప్లాజాలో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్స్‌కు వెళ్లి, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వికలాంగులకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి చేతుల మీదుగా పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పోలీసు అకాడమీకి వెళ్లి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే రోజు రాత్రి 7.30 గంటలకు షా న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement