Sunday, May 5, 2024

Bomb: దుబాయ్ ఫ్లైట్‌కి బాంబు బెదిరింపు.. తాగుబోతు చేసిన ఫోన్‌కాల్‌తో పోలీసులు, అధికారులు ఆగ‌మాగం!

ఓ తాగుబోతు చేసిన ప‌ని దుబాయ్ వెళ్లాల్సిన విమానాన్ని ఆగిపోయేలా చేసింది. ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులను ఉరుకులు ప‌రుగులు పెట్టేలా చేసింది. ఆ తాగుబోతు కుటుంబానికి చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు శ‌నివారం ఉద‌యం దుబాయ్ వెళ్లేందుకు ఇంటి నుంచి బ‌య‌లుదేరారు. అయితే వాళ్లు దుబాయ్‌కి వెళ్ల‌డం అత‌నికి ఇష్టం లేదు. అందుక‌ని వారిని ఎట్లైనా ఆగిపోయేలా ప్లాన్ చేయాల‌నుకున్నాడు. కానీ, వాళ్లు అత‌ని మాట‌ను ప‌ట్టించుకోకుండా ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. దాంతో వాళ్ల‌ను ఎలాగైనా దుబాయ్ వెళ్ల‌కుండా ఆపాల‌ని తాగుబోతు ప్లాన్ చేశాడు.

ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బందికి ఫోన్ చేసి దుబాయ్ వెళ్లే విమానంలో బాంబు ఉంద‌ని చెప్పాడు. దాంతో అధికారులు ఉరుకులు ప‌రుగులు పెట్టి బాంబు కోసం గాలించారు. ఎంత వెతికినా బాంబ్ జాడ దొర‌క్క‌పోవ‌డంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆ త‌ర్వాత ఆల‌స్యంగా విమానం దుబాయ్‌కి బ‌య‌లుదేరింది. ఇక‌ ఫోన్ కాల్ ఎవ‌రి నుంచి వ‌చ్చిందా అని ట్రేస్ చేయ‌గా నిందితుడు దొరికిపోయాడు. అత‌డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నాలుగు త‌గిలించి విచార‌ణ జ‌రిపితే.. త‌మ కుటుంబ‌స‌భ్యుల‌ను దుబాయ్ వెళ్ల‌కుండా ఆపేందుకే ఆ ప‌ని చేశాన‌ని చెప్పాడు. ఈ ఘ‌ట‌న ఇవ్వాల త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement