Saturday, May 18, 2024

రాష్ట్రంలో పెరిగిన పీజీ మెడికల్‌ సీట్లు.. 9 కళాశాలల్లో 236 సీట్ల పెంపుకు అనుమతి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని 9 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు పీజీ మెడికల్‌ సీట్లు మంజూరుయ్యాయి. సూర్యపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి 25, సిద్ధిపేట కాలేజీకి 80, నల్గొండ కాలేజీకి 30, నిజామాబాద్‌ కాలేజీకి 10, ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో 32, మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీకి 10, వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీకి 3, రిమ్స్‌ ఆదిలాబాద్‌లో 22, గాంధీ మెడికల్‌ కాలేజీ-సికింద్రాబాద్‌కి 14 సీట్లు మంజూరయ్యాయి. కాకతీయ మెడికల్‌ కాలేజీలో 10 సీట్లను అడగ్గా 3, సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీకి 22 సీట్లు అడగ్గా 14ను కేటాయించారు. మిగతా కాలేజీల్లో అడిగినన్ని సీట్లు మంజూరయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement