Tuesday, April 30, 2024

డ్రగ్స్ ముఠా అరెస్ట్ – రూపాయల విలువ చేసే కొకైన్‌ సీజ్

 హైదరాబాద్ – భారీగా మత్తు పదార్థాలు సప్లయ్ చేస్తున్న డ్రగ్‌ ముఠాను సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు చాకచాక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే కొకైన్‌ను సీజ్ చేశారు. డ్రగ్ కింగ్ పిన్‌తో పాటు మరో నలుగుర్ని చేశారు. విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొస్తూ హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్ కింగ్‌ పిన్‌తో పాటు మరో నలుగురు అరెస్టవ్వడంతో మరిన్ని వివరాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు. స్థానికంగా డ్రగ్స్ మాఫియాకు ఎవరు సహాయం అందిస్తున్నారు అనేది విచారణలో తేలనుందని పేర్కొంటున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement