Wednesday, May 1, 2024

Drugs : కేర‌ళ స‌ముద్రతీరంలో రూ.12వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్..

స‌ముద్ర‌మార్గంలో డ్ర‌గ్స్ ర‌వాణాని అరిక‌ట్టేందుకు నేవీ..నార్కోటిక్స్ సిబ్బంది సంయుక్తంగా ఆప‌రేష‌న్ స‌ముద్ర‌గుప్త్ పేరుతో ఓ ఆప‌రేష‌న్ ని చేప‌ట్టింద‌ని ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఆప‌రేష‌న్ లో భాగంగా కేర‌ళ‌ తీరంలో భారీ మొత్తంలో డ్రగ్స్ ను నేవీ, నార్కోటిక్స్ సిబ్బంది పట్టుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఓ షిప్ లో తీసుకొస్తున్న 2,500 కిలోల మెథాంఫెటమిన్ ను స్వాధీనం చేసుకున్నారు. షిప్ లో ఉన్న పాకిస్థానీ పౌరుడిని అరెస్టు చేశారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ.12 వేల కోట్ల దాకా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వస్తున్న ఈ షిప్ లో స్మగ్లర్లు 134 బస్తాలలో సూపర్ క్వాలిటీ మెథాంఫెటమిన్ ను తీసుకొస్తున్నారని అధికారులు చెప్పారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కు సంబంధించి కచ్చితమైన సమాచారం అందడంతో షిప్ కదలికలపై నిఘా పెట్టినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ షిప్ కేరళ తీరం ద్వారా శ్రీలంకకు వెళుతోందని, వెంట మరో రెండు పడవలు ఎస్కార్ట్ గా వస్తున్నాయని అధికారులు తెలిపారు. డ్రగ్స్ తీసుకెళుతున్న షిప్ ను పట్టుకోవడం చూసి మిగతా రెండు బోట్లలోని స్మగ్లర్లు తప్పించుకున్నారని వెల్ల‌డించారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement