Wednesday, May 1, 2024

విహారయాత్రలో విషాదం.. పడవ బోల్తా .. మూడుకి చేరిన మృతుల సంఖ్య

ఆవుకు రిజర్వాయర్లో పడవ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. అవుకు పరిధిలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రసూల్ కుటుంబం ఆదివారం కావడంతో సరదాగా బోటింగ్ షికారు వచ్చారు. మర బోటు పడవలో కుటుంబ సభ్యులందరూ కలిసి షికారు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా బోటు బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యుల్లో షేక్ ఆశాబి (18), సాజిత (21), నూర్జహాన్ నీటిలో మునిగి మృతి చెందారు వీరిలో షేక్ ఆశ (18), సాజిత (21) నీటిలో మునిగి మృతిచెంద‌గా, వీరి మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు. చనిపోయిన వారిలో నూర్జాన్ అనే మహిళ నంద్యాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement