Saturday, May 18, 2024

డోంట్ వ‌ర్రీ.. గ్యాస్ లీకేజీ కాకుండా చ‌ర్య‌లు తీసుకున్నాం: మేయర్ నీలా

కుత్భుల్లాపూర్, (ప్రభ న్యూస్): హైద‌రాబాద్ న‌వాబ్ పేట‌లో పైపు పగిలి గ్యాస్ లీకేజీ అయ్యిందన్న విషయాన్ని తెలుసుకున్న మేయర్ నీలా గోపాల్ రెడ్డి సంబంధిత అధికారులతో అక్కడి కి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. 14వ డివిజన్ పరిధిలోని గాయత్రి టవర్స్ ముందు రోడ్ వద్ద వాటర్ వర్క్స్ మరమ్మతులు చేస్తుండగా అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్ లైన్ పగిలి గ్యాస్ లీకేజీ అయ్యింది.ఈ సందర్భంగా మేయర్ నీలా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ… గ్యాస్ లీకేజీ అవ్వకుండా వెంటనే సరఫరా నిలిపివేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా, ఎటువంటి ప్రమాదం జరగకుండా, చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సంద‌ర్భంగా 14వ డివిజన్ టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బ శ్రీనివాస్ , వాటర్ వర్క్స్ మేనేజరు సాయిరాం రెడ్డి , ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement