Monday, April 29, 2024

విశాఖ‌లో దేశీయ ఐటీ దిగ్గ‌జం – ఇన్ఫోసిస్ భారీ క్యాంప‌స్

విశాఖ‌ప‌ట్నంలో దేశీయ ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ భారీ క్యాంప‌స్ ఏర్పాటుకు సంసిద్ధం వ్య‌క్తం చేసింది. విడ‌త‌ల వారీగా 3 వేల సీటింగ్ కెపాసిటీ క‌లిగి ఉంటుంద‌ట ఈ క్యాంప‌స్ . ఈ మేర‌కు ఇటీవ‌లే ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాధ్‌తో సంస్థ ప్ర‌తినిధులు భేటీ అయ్యారు. తొలి ద‌శ‌లో 1,000 సీటింగ్ కెపాసిటీతో ఈ క్యాంప‌స్‌ను ఆ సంస్థ ప్రారంభించ‌నుంది. ఈ క్యాంపస్ ఏకంగా ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని స‌మాచారం. అంతేకాకుండా తొలుత వెయ్యి సీటింగ్ కెపాసిటీతోనే ప్రారంభం కానున్న ఈ క్యాంప‌స్‌ను ఇన్ఫోసిస్‌ ద‌శ‌ల‌వారీగా 3 వేల సీటింగ్ కెపాసిటీకి పెంచ‌నుంద‌ట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement