Friday, May 3, 2024

చిన‌జీయర్ స్వామితో విభేదాలున్నాయని ఊహించుకోవద్దు: సీఎం కేసీఆర్

ఎప్పుడో 20 ఏళ్ల కిందట చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవల చిన‌జీయర్ స్వామిపై తెలంగాణ వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆ విషయం అటుంచితే… ఇటీవల జరిగిన పరిణామాల‌తో సీఎం కేసీఆర్ కు, చిన‌జీయర్ కు మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ముచ్చింతల్ ఆశ్రమంలో జరిగిన సహస్రాబ్ది వేడుకలకు సీఎం కేసీఆర్ అంటీముట్టనట్టుగా ఉన్నారు. ఆ ఎపిసోడ్ ముగిసిన కొన్నిరోజులకే సమ్మక్క-సారలమ్మలపై జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తెరపైకి రావడంతో ఆయనపై విమర్శల జడివాన కురిసింది. దాంతో ఊహాగానాలు మరింత బలంగా వినిపించాయి.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించారు. చిన‌జీయర్ స్వామితో తనకు విభేదాలున్నాయని ఎవరూ ఊహించుకోవద్దని అన్నారు. అసలు తమ మధ్య విభేదాలున్నాయని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. చిన‌జీయర్ స్వామికి, తనకు మధ్య అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దని హితవు పలికారు. ఇద్ద‌రి మధ్య ఎడం ఉందని ఎవరికి వారే ఊహించుకుంటే ఎలా? అని అసహనం వెలిబుచ్చారు. ఈ అంశంపై స్పందించాల్సిన అవసరమే లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement